నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
ఏ నిమిషంలోనైనా ప్రకటన రావొచ్చు ... మనకు గ్రూపులోద్దు ... గెలుపే ముఖ్యం
స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఏ నిమిషంలోనైనా ప్రకటన రావొచ్చన్నారు. గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పార్టీ సిద్ధాంతమే మన సిద్ధాంతం, పార్టీ ఆలోచనే మన ఆలోచన కావాలని ఉధ్బోధించారు. పార్టీ పదవుల్లోనో, స్థానిక సంస్థల పదవుల్లోనో, ప్రభుత్వ పదవుల్లోనో నాయకులను, కార్యకర్తలను కూర్చోబెట్టే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ నిర్ణయం మేరకే కష్ట పడి పని చేసే నాయకుడ్ని, కార్యకర్తను నిలబెడతామన్నారు. పాలేరు నియోజవర్గానికి తాను కేటాయించే సమయం కన్నా, గంట ఎక్కువ కొత్తగూడెం నియోజక వర్గానికి కేటాయిస్తానని పొంగులేటి ఈ సందర్భంగా మాట ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన మాటను గౌరవించి, ఇక్కడ కమ్యూనిష్టు అభ్యర్ధిని గెలిపించినందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అయితే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నియోజక వర్గం నుండి పోటీ చేయలేక పోవడంపై ఇచ్చిన సుధీర్ఘమైన వివరణ ఇప్పుడు ఇటు పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Comments
Post a Comment